తిరుమలకు బస్సులు బంద్ !

busరాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. ఏపీ ఎన్జీవోలు చేపట్టిన నిరవధిక సమ్మె గత అర్థ రాత్రి నుంచి కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో.. తిరుమల కొండపైకి కూడా బస్సులు నడపడం లేదు. దీంతో.. తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, తిరుమల కొండపైకి వెళ్లె బస్సులు బంద్ కావడం 38 ఏళ్ల తరవాత ఇదే ప్రథమం. ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన ఈ ధర్నాలో దాదాపు 4.25 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నట్లు సమాచారం.