నలుగురితో.. ఉన్నత స్థాయి కమిటీ !

ak antony digvijya singరాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలను వినిపించడానికి కేంద్రం నలుగురితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏఐసీసీ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. అయితే, మొదట ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేద్దామని భావించినప్పటికినీ.. చివరగా నలుగురితో కూడిన ఉన్నత స్థాయి కమిటీకే కాంగ్రెస్ అధిష్టానం జై కొట్టింది. ఈ కమిటీ విభజన ప్రక్రియకు సంబంధించి మూడు ప్రాంతాల మధ్య రాజీ కుదిర్చేందుకు వారి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ కమిటీలో దిగ్విజయ్ సింగ్ తో పాటు మొయిలీ ,అహ్మద్ పటేల్ సభ్యులుగా ఉన్నారు.