కేసీఆర్ హత్యకు కుట్ర..?

harish-raoతెరాస అధినేత కేసీఆర్ ను హత్య చేయడానికి కుట్ర జరుగుతుందని ఆ పార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేంధర్ ఆరోపించారు. కేసీఆర్ ను హత్య చేసేందుకు సుపారీలు ఇచ్చినట్లు తెలిసిందని వారు తెలిపారు. మూడు రోజుల క్రితమే ఇంటెల్ జెన్స్ వర్గాలు సమాచారమిచ్చినా.. ప్రభుత్వంలో ఏమాత్రం కదిలికలేదన్నారు. ఈ కుట్రకు కారకులెవరో మాకు తెలుసునని.. సమయం వచ్చినప్పుడు బయటపెడతామని అన్నారు. ఈ కుట్రపై సమగ్ర విచారణ జరిపించాలని.. కేసీఆర్ కు జడ్ ప్లస్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేసీఆర్ కు ప్రాణహాని జరిగితే.. తెలంగాణ అల్లకల్లోలమవుతుందని వారు హెచ్చరించారు.