పోటాపోటీ సమైక్య, సపరేట్ నినాదాలు !

apngosవిద్యుత్ సౌధలో బోజన విరామ సమయంలో సమైక్య, సపరేట్ నినాదాలతో మారుమ్రోగింది. విద్యుత్ సౌధలో పని చేస్తున్న ఏపీఎన్జీవోలు భోజన విరామ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అంతేకాకుండా ర్యాలీ చేపట్టి సమైక్యాంధ్రకు అనుకూల నినాదాలు చేశారు. ప్రతిగా టీఎన్జీవోలు కూడా నినాదాలు చేశారు. ఇరు ప్రాంతాల ఎన్జీవోలు పరస్పర నినాదాలతో విద్యుత్ సౌధను హోరెత్తించారు. తెలంగాణ ఉద్యోగులు ఉద్యమం చేసినప్పుడు తాము సహకరించామని అది గుర్తుంచుకోవాలని ఆంధ్ర ఉద్యోగులు సూచించారు.