తగలబెట్టినా… వెనక్కు తగ్గం !

CPI-Narayanaతమ దిష్టిబొమ్మలు కాదు.. తమను తగలబెట్టినా రాష్ట్ర విభజనపై తమ విధానం మారదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం కోరుకునే వారు 23 జిల్లాల ప్రజలు ఆందోళనలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనకు సీపీఐ జై కొట్టినందున.. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను ఎలా సముదాయించాలనే దానిపై ఆ పార్టీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటవుతోందని చెబుతూనే.. కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సమన్యాయం దక్కేలా చూడడమే తమ ప్రధాన కర్తవ్యమని చెబుతోంది. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం హైదరాబాద్‌ లో వివిధ రంగాల నిపుణులు, మేధావులతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ చర్చలు జరిపారు.