తెదేపా తెలంగాణకు కట్టుబడి వుంది : నామా

Nama-Nageswara-Raoతెలుగు దేశం పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అదేవిధంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కూడా తెదేపా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. నిన్న (శుక్రవారం) అధినేత చంద్రబాబు నాయుడు నివాసం లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో కూడా పై విషయాలకు కట్టుబడి వుండాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.  హైదరాబాద్ కేసీఆర్ జాగీర్ కాదని..  సీమాంధ్ర ఉద్యోగులు గురించి మాట్లాడేందుకు ఆయన ఎవరని నామా ప్రశ్నించారు. మొత్తానికి తెదేపా విభజన విషయంలో సర్ధుబాటు దారిలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. రెండు ప్రాంతాలలో పార్టీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని సర్ధుబాటు మార్గాన్ని అవలంబిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.