రాజీనామాలు అవసరం లేదట !

Panabaka-Lakshmiరాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడాన్ని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ తప్పుబట్టారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయవద్దని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె సూచించారు. అందరూ సయంమనం పాటించాలని ఆమె కోరారు. హైదరాబాద్ అంటే అందరికీ సెంటిమెంట్ ఉందని.. అదే విషయాన్ని అధిష్టానానికి తెలియజేద్దామని పనబాక అన్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విఘాతం కలిగించవద్దని ఆమె కోరారు.