ఛార్మి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం మంత్ర. ఈ సినిమాలో భలే భయపెట్టింది. తానూ భయపడింది. దర్శకుడిగా ఓషో తులసీరామ్కి ఇదే తొలి సినిమా. ఒక విధంగా థ్రిల్లర్ సినిమాలకు మళ్లీ ఊపిరి పోసింది ఈ చిత్రమే. ఇప్పుడు మంత్ర 2 రాబోతోంది. ఈ చిత్రంతో ఎస్.వి.సురేష్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. బోనాల శ్రీకాంత్, రవితేజ నిర్మాతలు. ”ఇది వరకు వచ్చిన మంత్ర సినిమాకీ ఈ సినిమాకీ సంబంధం లేదు. కానీ ఆ స్థాయిలో భయపెడుతుంది. విజువల్ ఎఫెక్ట్కి ప్రాధాన్యం ఉంది” అని చిత్రబృందం చెబుతోంది. త్వరలో మిగిలిన వివరాలు తెలుస్తాయి.