రగులుతున్న సీమాంధ్ర !

seemandraకేంద్రం తెలంగాణ ఏర్పాటుపై మరో కొన్ని గంటల్లో ప్రకటన చేయబోతుందన్న వార్తల నేపథ్యంలో.. సీమాంధ్రలో నిరసనలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోకపోతే.. సీమాంధ్ర నేతలను తరిమి కొడతామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రానికి సమైక్యంగా వుంచాలని డిమాండ్ చేస్తూ… ఈరోజు సమైక్యాంధ్ర జేఏసీ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్రబలగాలు సీమాంధ్రలో కాపుకాస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణపై కేంద్రం ప్రకటన చేస్తుందని వార్తల నేపథ్యంలో.. సీమాంధ్ర ప్రాంతం యుద్ద వాతావరణాన్ని తలపిస్తుంది.