పంచాయితీ పోరులో తృణమూల్ ఆధిక్యం !

tunamolపశ్చిమ బెంగాల్ పంచాయితీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపు 17 జిల్లాల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో తీవ్రంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.