మరోసారి త్రిమూర్తుల ఢిల్లీ టూర్..!

cm-kiran-damodar-narasima-bరాష్ట్ర ముఖ్యనేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ లకు మరోసారి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. రేపు సీడబ్ల్యూసీ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. త్రిమూర్తులు ఢిల్లీ రావాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై తుది నిర్ణయమంటూ సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో.. త్రిమూర్తుల హస్తినా టూర్ ఆసక్తికరంగా మారింది. రేపు సమావేశమయ్యే సీడబ్ల్యూసీ లోనే తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు
సమాచారం. మరీ నిజంగానే కాంగ్రెస్ కేంద్రం తెలంగాణపై తేల్చేస్తుందా.. లేదా అలవాటుగానే తుస్స్ మనిపిస్తుందా.. వేచి చూడాలి.