పంతాలు తగ్గాయి. పట్టుదలలు పోయాయి. పవన్ కల్యాణ్ సినిమాకి పోటీగా వెళ్తే సీన్ ఎలా ఉంటుందో ముందే క్లియర్గా అర్థమైంది ఎవడు టీమ్కి..! అందుకే వెనక్కి వెళ్లిపోయారు. అత్తారింటికి హడావుడి తగ్గాకే రావాలని నిర్ణయించుకొన్నారు. అందుకే ఈ సినిమాని ఆగస్టు 21కి వాయిదా వేశారు. రాఖీ పండుగ, చిరంజీవి పుట్టిన రోజు కలిసొస్తాయని దిల్ రాజు గట్టిగా నమ్ముతున్నాడు. ఈ పరిణామంతా నిన్న ఒక్క రోజులో జరిగిందేం కాదు. ముందు నుంచీ జులై 31న రావడానికి చిత్రబృందం తటపటాయిస్తూనే ఉంది. అత్తారింటికి వెనక్కి వెళితే బాగుంటుందని కోరుకొన్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్తో మంతనాలు జరిపారు. ఇవన్నీ కుదరకపోవడంతో తామే వెనకడుగు వేశారు.
శనివారం ప్రెస్ మీట్ పెట్టి.. వాయిదాని అధికారికంగా ప్రకటించాడు దిల్ రాజు. మేం భయపడ లేదని – బాబాయ్ అంటే అబ్బాయికి గౌరవం తప్ప భయం లేదని.. దిల్ రాజు తన హీరోని వెనకేసుకొచ్చాడు. అది భయమా? గౌరవమా? అనేది ఫ్యాన్స్కి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది.