త్వర‌లో మ‌హేష్‌ తో సినిమా

vamsi-paidipally-mahesh-babప్రభాస్‌ ని ‘మున్నా’గా చూపించిన ద‌ర్శకుడు వంశీ పైడిప‌ల్లి. ‘బృందావ‌నం’తో తొలి విజ‌యాన్ని అందుకొన్నాడు. రామ్‌ చ‌ర‌ణ్‌ తో ‘ఎవ‌డు’ రూపొందించాడు. ఈ సినిమా ఈనెల 31 న రాబోతోంది. ఆ త‌ర‌వాత త‌న కొత్త ప్రాజెక్టు గురించి కూడా చెప్పాడు. త్వర‌లో మ‌హేష్‌ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడ‌ట‌. అయితే ఆ వివ‌రాలు ఎవ‌డు రిలీజ్ అయిన త‌ర‌వాతే చెబుతాడ‌ట‌. శ‌నివారం ఈ ద‌ర్శకుడి పుట్టిన‌ రోజు. ఈ సంద‌ర్భంగా వంశీ మాట్లాడుతూ ”ఎవ‌డు విడుద‌ల రోజే నా అస‌లైన పుట్టిన రోజు. ఇదో పక్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా. అన్ని హంగులూ ఉంటాయ్‌. ఓ కొత్త రామ్‌ చ‌ర‌ణ్‌ ని చూస్తారు. బ‌న్నీ లేక‌పోతే ఈ సినిమా లేదు. చిన్న పాత్రే అయినా.. బ‌న్నీ వ‌ల్లే ఆ పాత్ర కు అంత విలువ వ‌చ్చింది. బ‌న్నీ ఒప్పుకోక‌పోతే ఈసినిమా చేసేవాళ్లమే కాదు..” అంటున్నాడు ఈ బ‌ర్త్‌ డే బోయ్‌!