‘ఎవడు’ లో ‘పవన్’ భజన

pavan-charnసినిమా ఏదైనా కానివ్వండి.. సన్నివేశం మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట, డైలాగ్, సీన్ ఇలా ఏ చిన్న బిట్ వచ్చిన చాలు.. ధియేటర్లో సందడే వేరు. విజల్స్ తో మోత మొగాల్సిందే. అంతటి చరిస్మా పవన్ కు మాత్రమే సొంతం. ఇక ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని చిత్రాలలో పవర్ స్టార్ చరిస్మా ను బాగానే వాడుకున్నారు. నితిన్ అయితే పవన్ హిట్ సాంగ్ ను టైటిల్ గా పెట్టుకుంటూ.. పవన్ సినిమాలలోని కొన్ని సన్నివేశాలను తన సినిమాలలో పెట్టుకుని ‘గుండెజారి గల్లంతయ్యిందే’ రూపంలో సూపర్ హిట్ కొట్టేశాడు.

రవితేజ బలుపు లో గబ్బర్ సింగ్ లో ఓ సన్నివేశాన్ని ప్లే చేసి పవన్ అభిమానులను ఖుషి చేశారు. ఇక పవన్ చిత్రాలలోని సన్నివేశాలను వాడుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. ఇప్పుడు అబ్బాయ్ చరణ్ వంతు వచ్చింది. చరణ్ తాజా చిత్రం ఎవడు. ఈ చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ సంభందించి సన్నివేశాలు బాగానే వున్నాయట. ఇప్పటికే వపన్ కళ్యాణ్ మీద రాసిన ఓ డైలాగ్ బయటికి వచ్చి అందరి నోళ్లలో నానుతోంది. ‘పవన్ కళ్యాణ్ లా ఫైట్ చేస్తే నిన్ను ప్రేమిస్తానని శృతి హసన్ అంటే, అయితే నన్ను మర్చిపో, అంత సీన్ ఎవడికీ లేదు’ అంటూ చరణ్ చెప్పే డైలాగ్ విని ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అయితే ఇది మాత్రం శాంపిల్ మాత్రమేనట. పవన్ పై మరికొన్ని డైలాగ్స్, సన్నివేశాలు ‘ఎవడు’ లో వున్నాయట. మరో వైపు చిరుతో పవన్‌ కు చెడిందా? అనే వార్త మీడియా లో గట్టిగా వినిపిస్తున్న నేపధ్యం లో ఈ చిత్రంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి చరణ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.