మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా !

Sridhara Krishnaసమైక్యాంధ్రకు మద్దతుగా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డిలు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాలను స్వీకర్ ఫార్మెట్ లో ఫాక్స్ ద్వారా స్వీకర్ నాదెండ్ల మనోహర్ కు పంపినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఇప్పటికే సమైక్యాంధ్ర కోసం వైకాపాకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు సిద్ధమైతే.. మరికొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.