త్రిమూర్తులకు ఢిల్లీ పిలుపు !

27-botsa-kiran07-300రాష్ట్ర అగ్రనేతలకు మళ్లీ ఢిల్లీ పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ,పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణలకు ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవడానికే త్రిమూర్తులను హస్తినకు రావాలని పిలుపు వచ్చినప్పటికినీ.. తాజాగా రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయితీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం
ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి,పిసిసి అద్యక్షుడు ఢిల్లీకి వెళ్లనున్నట్లు వినికిడి. ఇప్పటికే డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఢిల్లీలో ఉన్నారు.