గిడుగు రాజేశ్వరరావు ఇక లేరు

giduguసుప్రసిద్ధ రచయిత గిడుగు రాజేశ్వరరావు కన్నుమూశారు. హైదరాబాద్ బయలుదేరుతూ ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆయన హైదరాబాద్ రావలసి ఉంది. ఆయన బాలసాహిత్యంలో ఎంతో కృషి చేసిన సుప్రసిద్ద రచయిత. కంద పద్యశతకాలు, జీవిత చరిత్రలు, రేడియో నాటికలు రాశారు.