గుణశేఖర్ తన సినిమాలో రోజుకో ట్విస్టు ఇస్తున్నాడు. ఒకొక్క ప్రత్యేకతతో సినిమా నింపేస్తున్నాడు. ఒక్కో క్యారెక్టర్ ఈ సినిమాలో పెంచుకొంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు బాల నటుల వంతు వచ్చింది. రుద్రమ దేవి సినిమాలో బుల్లి అనుష్క, చిన్నప్పటి రానా కావలసి వచ్చారు. అందుకోసం శ్రీకాంత్ వారసులను ఎంచుకొన్నాడు. శ్రీకాంత్- ఊహలకు ముగ్గురు సంతానం. వారిలో… రోషన్ని చిన్నప్పటి రానాగా, మేథని బుల్లి అనుష్క పాత్రల్లో ఎంచుకొన్నాడు గుణశేఖర్. ప్రస్తుతం వీళ్లిద్దరికీ గుర్రపు స్వారీ, కత్తియుద్ధాల్లో శిక్షణ ఇస్తున్నారట. ఇప్పటికే 45 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 7 నుంచి మూడో షెడ్యూలు మొదలుపెడతారు. ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు.