పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ అత్తారింటికి దారేది. పవన్ సరసన సమంత, ప్రణీతలు నటించిన ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని ఈ రోజు ఆడియో వేడుక జరుపుకోనుంది. తాజాగా ఈ చిత్రం స్టోరి లైన్ లీకై నెట్ లో హాల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం స్టోరి లైన్ ఏమిటంటే… విదేశాల్లో ఉన్నపవన్… ఇండియాలో తనకు ఓ అత్తమ్మ(నదియా) ఉందని, ఆ కుటుంబంతో ఎన్నో యేళ్లుగా విబేధాలున్నాయని తెలుస్తుంది. తాతయ్య బొమన్ ఇరానీ దగ్గర అనుమతి తీసుకొని అత్తారింటికి దారేది అంటూ వెతుక్కొంటూ ఇండియా వస్తాడు. ఇక్కడ సమంతతో ప్రేమలో పడతాడు. ఇంతకీ సమంత ఎవరో కాదు.. అత్తమ్మ కూతురే. అందుకే ఆ ఇంట్లో డ్రైవర్గా చేరతాడు. మరి అత్తమ్మని ఎలా దారిలోకి తీసుకొచ్చాడు అనేదే ఆసక్తికరం. స్టోరి లైన్ పాతదే అయిన ట్రీట్ మెంట్ కొత్తగా వుంటుందట. ఇండస్ట్రీ మొత్తం ఆసక్తి గా ఎదురుచూస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.