శంకర్రావుకు స్వల్ప ఊరట

shankar-raoమాజీ మంత్రి శంకర్రావుకు  హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై శంకర్రావుపై కేసు నమోదయిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో విచారణను వారం రోజుల పాటు నిలిపివేయాలని కోర్టు స్టే విధించింది. కొన్నిరోజుల కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ నిలిపివేయాలని కోరుతూ శంకర్రావు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించిన న్యాయస్థానం తాజా ఉత్తర్వులు వెలువరించింది.