కేంద్రమంత్రిపై కాల్పులు !

kahan chowdaryపశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస కొనసాగుతూనే వుంది. మూడో దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎ.హెచ్. ఖాన్ చౌదరి పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే, దుండగులు జరిపిన కాల్పుల నుంచి మంత్రి త్రుటిలో తప్పించుకున్నారు. కాగా, నిన్న జరిగిన రెండో దశ ఎన్నికల్లో జరిగిన గొడవలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే.