జులై 19.. దగ్గర పడేకొద్దీ కల్యాణ్రామ్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఓమ్ ఎలాంటి ఫలితం ఇస్తుందో అని ఆందోళన పడుతున్నాడు. అందుకే గుళ్లు, దర్గాల చుట్టూ తిరుగుతున్నాడు. మొక్కులు చెల్లించుకొంటున్నాడు. రూ. 25 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా ఫలితంపై కల్యాణ్రామ్ కెరీర్ ఆధారపడి ఉంది. అటు నిర్మాతగా, ఇటు కథానాయకుడిగా ఓమ్ హిట్టు కొట్టడం అత్యవసరం! దానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకొన్నాడు. రజనీకాంత్కి ఈసినిమా చూపించి.. ఆయన ఆశీస్సులు తీసుకొన్నాడు. అది ఒక రకంగా ప్రచారానికి ఉపయోగపడింది. అయితే ప్రమోషన్ ఇంకా స్లోగానే కనిపిస్తోంది. చివరి మూడు రోజుల్లో ప్రమోషన్ మీద దృష్టి పెట్టనున్నాడు. ఈ కష్టాలన్నీ ఫలించి, దేవుడు కనికరిస్తే.. కల్యాణ్రామ్ కెరీర్లో అతనొక్కడే లాంటి హిట్టు పడిపోవడం ఖాయం.