పెట్టుబడులకు స్వాగతం : చిదంబరం

chidambaramప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ఈరోజు (మంగళవారం) ఓ ప్రకటన చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ. 1.15 లక్షల కోట్ల పెట్టుబడులు స్వీకరించనున్నట్లు వివరించారు. బొగ్గు, గ్యాస్ ఆధారిత ఎగుమతులను పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. అయితే, నగదు బదిలీ పథకం ద్వారానే వంటగ్యాస్ సరఫరా చేయనున్నట్లు చిద్దూ స్పష్టం చేశారు.