మూహుర్తం మారింది..!

sonija-digvijayతెలంగాణ అంశంపై ఈరోజు సాయంత్రం సమావేశం కానున్న కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగ్ ముహుర్తం కాస్త మారినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 5.30 నిమిషాలకు ఉన్న కోర్ కమిటీ సమావేశాన్ని సాయంత్రం 4.00 గంటలకు మార్చారు. తెలంగాణ భవిష్యత్ ను ప్రభావితం చేసే ఈ సమావేశం సుదీర్ఘంగా జరిగే అవకాశాలున్నందున సమయాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోర్ కమిటీ సమావేశానికి ముందే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయిన విషయం తెలిసిందే.