ముందే మాట్లాడుకున్నారు!

cm-kiran-soniagandhiకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. కొన్ని గంటల వ్యవధిలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో.. వీరి భేటి ప్రాధాన్యతను సతరించుకుంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిస్థితులను సీఎం అధినేత్రికి వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రాష్ట్ర విభజనపై ఓ నివేదికను కూడా ఆయన సోనియాకు అందించినట్లుతెలుస్తోంది. కాగా, గతంలో అధినేత్రికి అపాయింట్ కోసం సీఎం రెండు రోజులు వేచి చూసిన విషయం తెలిసిందే.