శ్రీనగర్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

Major-fire-at-Srinagar-Secrజమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ సచివాలయంలో ఈరోజు (గురువారం) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత సచివాలయం ప్రాంగణంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో రెండతస్తుల భవనం మంటలు ఆహుతైపోయాయి. ఈ ప్రమాదంలో పలు కీలక పత్రాలు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. అయితే, ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది.