క్రిష్ చేతికి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆయన ఇప్పుడు నాగబాబు తనయుడు వరుణ్తేజ్ని హీరోగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా కథ గురించి డిస్కర్షన్స్ నడుస్తున్నాయి. అంతా బానే ఉంది. మరి శివం ఏమైంది? క్రిష్- మహేష్- అశ్వనీదత్ కాంబినేషన్లో శివం సినిమా వస్తుందని యేడాదిగా చెబుతున్నారు. క్రిష్ కూడా ఈ స్ర్కిప్టు పూర్తిచేశాడని అన్నారు. అయితే ఈ సినిమా ఒక్క ఇంచుకూడా కదల్లేదు. ఈలోగా అశ్వనీదత్ మరో ఆఫర్ ఇచ్చేశారు క్రిష్కి. ఇది శివం బదులుగా వస్తున్న సినిమా అని… శివం సెట్స్పైకి వెళ్లడం లేదని టాలీవుడ్లో చెప్పుకొంటున్నారు. అయితే శివం గురించి.. క్రిష్ ధీమాగానే ఉన్నారు. మహేష్ ఎప్పుడు కాల్షీట్లు ఇస్తే అప్పుడు ఈ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్తా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.