త్వరలోనే తీపి కబురు : దిగ్విజయ్

digvijaysigరాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తో ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. డిగ్గీ రాజా విద్యార్థులతో కొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. విద్యార్థులతో దిగ్విజయ్ మాట్లాడుతూ.. త్వరలోనే తీపి కబురు చెబుతామని.. ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. పది పదిహేను రోజుల్లో తెలంగాణపై నిర్ణయం ఉంటుందని డిగ్గీ రాజా విద్యార్థులతో అన్నారు. అయితే, పంచాయితీ ఎన్నికల్లోపు తెలంగాణపై ప్రకటన రాకపోతే కాంగ్రెస్ ఎన్నికల జిమ్మిక్కుని అనుకోవాల్సి ఉంటుందని ఓయూ జేఏసీ విద్యార్థులు డిగ్గీ రాజా వద్ద స్పష్టం చేసినట్లు సమాచారం.