వైఎస్ఆర్ కు ఘననివాళులు !

YSRమాజీ ముఖ్యమంత్రి దిగవంత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా.. నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో.. వైఎస్
చిత్రపటానికి నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, శ్రీధర్ బాబు, ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా.. ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని సమాధిస్థలి దగ్గర అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. కాగా, ’మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా విశాఖ లో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల వైఎస్ ఆర్ జయంతిని పురష్కరించుకుని రక్తదానం చేశారు. ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం విశేషం.