నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎంట్రీ ఇప్పుడు కాస్త డైలామాలో పడింది. తొలుత ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెడదామనుకొన్నారు. ఆ తరవాత నిర్ణయం మార్చుకొని – పూరి దగ్గరకు వచ్చాడు నాగబాబు. ఇప్పుడు పూరిని కూడా పక్కన పెట్టి క్రిష్తో జత కట్టబోతున్నాడు. పూరి- పవన్ల మధ్య మనస్ఫర్థలు వచ్చిన నేపథ్యంలో పూరితో సినిమా తీస్తే – మెగా ఫ్యాన్స్కి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నది నాగబాబు భయం. పైగా పవన్తో నాగబాబుకి ఎటాచ్మెంట్ ఎక్కువ. తమ్ముడిని కాదని ఏదీ చేయలేడు. అందుకే ఎందుకొచ్చిన గొడవ అనుకొని తన నిర్ణయం మార్చుకొన్నాడు. ఇప్పుడు వరుణ్తేజ్ సినిమా క్రిష్ చేతికి వెళ్లింది. ఆయన ఇప్పుడు కథల వేటలో ఉన్నారు. కథ దొరికేలోగా నాగబాబు మళ్లీ మనసు మార్చుకొంటాడా, ఇంకో దర్శకుడి పేరు బయటకు వస్తుందా?? అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.