అనుమానాస్పదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పొడుగుకాళ్ల సుందరి హంసానందిని. ఆ తరవాత ఆమె జాడలేదు. మళ్లీ మిర్చిలో.. ప్రత్యేక గీతంతో హల్ చల్ చేసింది. ఆ పాటతో హంస పేరు మళ్లీ హోరెత్తిపోయింది. ఇప్పుడు ఇంకో బంపర్ ఆఫర్ తగింది. పవన్ కల్యాణ్తో కలిసి చిందేయడానికి సిద్ధం అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అత్తారింటికి దారేది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. డీఎస్పీ మ్యూజిక్ అంటే ఓ ప్రత్యేక గీతం ఉండాల్సిందే. ఈ సినిమాలోనూ అలాంటి పాట ఉంది. అంది హంసా నందినితో చేయిస్తే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే ఈ పాటను తెరకెక్కిస్తారట.