ఇది మాత్రం ఫైనల్ : కావూరి

Kavuriతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరలోనే అందరికీ ఆమోదనీయమైన నిర్ణయం వెలువడుతుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. రాష్ట్ర విభజనపై గతంలో తాను చేసిన వ్యాఖల్లో శాస్త్రీయత లేదని, ఇప్పుడు శాస్త్రీయంగా మాట్లాడుతున్నానని అన్నారు. పదవులు వచ్చిన తన గళంలో మార్పు లేదని స్పష్టం చేశారు. అందరి యోగ క్షేమాలు ఆలోచించే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.