మోడీని దెబ్బతీసేందుకే.. !

Ishrat-Jahanగుజరాత్ ఎన్ కౌంటర్ లో మరణించిన ఇష్రాత్ జహాన్ టెర్రరిస్టు కాదు అని చెప్పేందుకు కాంగ్రెస్ ఎందుకంత ఆరాటపడుతుందో అర్థం కావడంలేదని బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  ఇష్రాత్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతోందని వ్యాఖ్యానించారు. ఇష్రాత్ వ్యవహారంతో…  కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారగలదని అర్థమయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదాన్ని కూడా ఓటుబ్యాంకుగా మార్చుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని వెంకయ్య దుయ్యబట్టారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని దెబ్బతీసేందుకే..  కాంగ్రెస్ ఇలాంటి  కుయుక్తులు పన్నుతోందని ఆయన ఆరోపించారు.