ఆయన ఓ ‘బిజినేస్ మేన్’..!

gutha-lagadapatiతెలంగాణ అంశంపై మరోసారి ఇరు ప్రాంత నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. నల్గొండ గుత్తా సుఖేంధర్ రెడ్డి ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. లగడపాటి నిన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వచ్చే తెలంగాణను రాకుండా సీమాంధ్ర నేతలు అడ్డుడుతున్నారని గుత్తా ఆరోపించారు. లగడపాటి అసలు రాజకీయ నాయకుడే కాదని.. ఆయన  ఓ ’బిజినేస్ మేన్’ మాత్రమేనని ఎద్దేవా చేశాడు. లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్న పార్టీకి వచ్చిన నష్టమేమి లేదని గుత్తా వ్యాఖ్యానించారు.