షిండేతో భేటీయైన దిగ్విజయ్ !

shinde-diggrajaకేంద్ర హోంశాఖ మంత్రి షిండేతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై, ముఖ్యంగా తెలంగాణ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ అంశంఫై ఇప్పటికే ముఖ్యమంత్రి, పీసీసీ ఛీఫ్ లను రోడ్ మ్యాప్ తయారు చేసుకొని రావాల్సిందిగా కోరానని పేర్కొన్నారు. అయితే, హోం మంత్రితో చర్చించిన విషయాలను వెల్లడించడానికి మాత్రం దిగ్విజయ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా, ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ అంశంఫై చర్చించనున్నట్లు తెలుస్తోంది.