రేపే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్..?

Panchayat election notificationరాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేవనుంది. మొదటగా నిర్వహించే పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నోటీఫికేషన్ రేపు (బుధవారం) విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 21540  గ్రామపంచాయితీలకు గాను మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మొదటి దశలో 27 రెవెన్యూ సబ్ డివిజన్లలో 6,875 గ్రామపంచాయితీలకు, రెండవ దశలో 28 సబ్ డివిజన్లలో 7,795 గ్రామపంచాయితీలకు, మూడవ దశలో 26 రెవెన్యూ సబ్ డివిజన్లలో 6873 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.