కేంద్రం రాయల తెలంగాణ ఇస్తే పరిశీలిస్తామని మాజీ కాంగ్రెస్ ఎంపి కే కేశవరావు చెప్పారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనానికి అభ్యంతరం ఉండదని కేశవరావు పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 30న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ బహిరంగ సభ కుట్రలో భాగమేనని ఆయన విమర్శించారు. వారంలోగా తెలంగాణ రాకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలను గ్రామాల్లోకి రానివ్వద్దని కేశవరావు హెచ్చరించారు.