తృటిలో తప్పిన ప్రమాదం

mohanbabuప్రముఖ కధానాయకుడు మోహన్ బాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బ్యాంకాక్ లో చోటు చేసుకుంది. తన భార్య నిర్మలతో కలిసి సముద్ర జలాల్లో వేగంగా తిరిగే బైక్ మీద మోహన్ బాబు ప్రయాణిస్తుండగా, ఉన్నట్టుండి బైక్ అదుపు తప్పి, ఒక్కసారిగా ఇద్దరూ నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన జాలర్లు వారిని రక్షించారు. విషయం తెలియగానే మంచు మనోష్, విష్ణు, ఇతర నటులు వారి వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనలో మోహన్ బాబుకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. దీంతో చిత్రం షూటింగు కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగు ప్రస్తుతం బ్యాంకాక్ సముద్రజలాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.