లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి ఇవ్వాలంటూ.. వ్యవసాయ శాఖా మంత్రి కన్నాలక్ష్మీనారాయణ, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శ్రీకాంత్ కుమార్ ని కోరారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శ్రీకాంత్ కుమార్ తో మంత్రి కన్నాలక్ష్మీనారాయణ ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవడంతో.. ఈ ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయ భూమి మొత్తం సాగులోకి వచ్చే అవకాశముందని ఈ సందర్భంగా కన్నా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలంటే లక్ష మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రమంత్రిని ఆయన కోరారు. అయితే, కన్నా అభ్యర్ధనపై శ్రీకాంత్ కుమార్ సానుకూలంగా స్పందించారని సమాచారం.