అభ్యర్థుల ఎన్నికల వ్యయం పెంపు..!

local-body-elections-in-apరానున్న స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది. తాజాగా, స్థానిక  సంస్థల ఎన్నికల వ్యయాన్ని 60 శాతం పెంచుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరల దృష్ట్యా ఎన్నికల కమీషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ల అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ తాజాగా పెంచిన ఎన్నికల వ్యయం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి :

1. జడ్పీటీసీ అభ్యర్ధి ఎన్నికల వ్యయాన్ని లక్ష రూపాయల నుంచి లక్షా ఇరవై వేలకు పెంచారు.

2. ఎంపీటీసీ అభ్యర్ధి ఎన్నికల వ్యయాన్ని 50 వేల నుంచి 80 వేలకు పెంచారు.

3. 10 వేల జనాభా కంటే తక్కువ ఉన్న పంచాయితీల్లో సర్పంచ్ అభ్యర్ధి వ్యయం 20 వేల నుంచి 30 వేలకు పెంచారు. పదివేల జనాభా కంటే ఎక్కువ ఉంటే 40 వేల నుంచి 64 వేలకు పెంచారు. వార్డు మెంబర్ల విషయంలో కూడా పదివేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 5 వేల నుంచి 8 వేలకు, పది వేల కంటే తక్కువుంటే 3 వేల నుంచి 4 వేలకు పెంచారు.