భాగ్యనగరంలో.. సీమాంధ్ర నేతల సమావేశం !

ganta tgరాష్ట్రంలో ఉద్యమాలు ఆగేలా లేవు. ఇటు తెలంగాణ ఉద్యమం, అటు సమైక్యాంధ్రా ఉద్యమంలలో ఏదో ఒక ఉద్యమం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా… కేంద్రం తెలంగాణ విషయాన్ని తేల్చేందుకు రెడీ అవుతున్నారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. తదుపరి కార్యచరణ కోసం హైదరాబా మంత్రుల నివాస ప్రాంగణంలో సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు శైలజా నాథ్, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాస రావు తదితరులు హాజరయ్యారు. మరోవైపు కావూరి లాంటి సీనియర్ నేతలు బయటికి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొంటున్నప్పటికినీ.. సమైక్యాంధ్ర కోసం తమ వంతు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.