ఉత్తరాఖండ్ బాధితులకు రూ.20 లక్షలు సహాయంగా అందించి తొలి అడుగు వేశాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు మరికొంతమంది కూడా తమ ఉదారతను చాటుకొనేందుకు ముందుకు వస్తున్నారు. మహేష్బాబు తన వంతుగా.. రూ.50 లక్షలు అందించినట్టు సమాచారమ్. అయితే ఈ విషయాన్ని ఆయన చాలా గోప్యంగా ఉంచదలచుకొన్నారు. ప్రస్తుతం వన్ షూటింగ్ నిమిత్తం మహేష్ విదేశాల్లో ఉన్నారు.
ఉత్తరాఖండ్ బాధితుల కోసం మా (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఓ ప్రత్యే కార్యక్రమం నిర్వహించి, వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని – పునరావాస నిర్మాణ కార్యక్రమాల కోసం కేటాయిస్తే బాగుంటుందని పరిశ్రమ భావిస్తోంది. ఇదివరకు ఇలాంటి విపత్తు సమయాల్లో ముందుకొచ్చి తనవంతు సహాయం అందించిన మా.. ఇప్పుడు పెను ప్రళయానికి ఎలా స్పందిస్తుందో చూడాలి. పవన్, మహేష్ మాత్రమే కాదు, యావత్ తెలుగుచిత్రపరిశ్రమ ముందుకు రావాల్సిన తరుణమిది.