జమ్మూకాశ్మీర్ చేరుకున్న ప్రధాని

manmohan-singhకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటుగా, ప్రధాని మన్మోహన్ సింగ్ జమ్మూకాశ్మీర్ చేరుకున్నారు. జమ్మూకాశ్మీర్ లో ప్రధాని రెండు రోజులు పర్యటించనున్నారు. నిన్న శ్రీనగర్ లో టెర్రర్ అటాక్ జరిగిన నేపథ్యంలో.. గట్టి బందోబస్తు మధ్య ప్రధాని-సోనియా ఉదయపూర్ చేరుకున్నారు. అయితే, ప్రధాని పర్యటన నేపథ్యంలో.. ఉదయపూర్ నగరం చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన మిలిటెంట్ల దాడిలో 8మంది జవాన్లు మరణించిగా, పలువురుకి గాయాలయిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాని మన్మోహన్ సింగ్ తన పర్యటనలో భాగంగా జమ్మూకాశ్మీర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద పొడవైన రైలు సొరంగ మార్గాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.