ప్రైవేటు వద్దు.. ప్రభుత్వమే ముద్దు..!

CM-Kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రైవేట్ పాఠశాల చదువుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు పాఠశాలలు చదువును వ్యాపారం చేసేశాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రైవేటు పాఠశాలలతో అనర్థమేనని ముఖ్యమంత్రి అంగీకరించారు. వాటికంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు ఆదర్శ పాఠశాలలు ఏర్పాటుచేశామని సీఎం చెప్పారు. అయితే, బాలబాలికలు మంచి పౌరులుగా ఎదగడానికి ఉపాధ్యాయుడే కీలకమని కిరణ్ అన్నారు.