అన్నివిధాల ఆదుకుంటాం..!

Shindeకేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈరోజు ఉత్తరాఖండ్ లో పర్యటనలో ఉన్నారు. వరదలతో వందల మంది మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డెహ్రాడూన్  వరద ప్రాంతాలలో  పర్యటించిన ఆనంతరం షిండే విలేకరులతో మాట్లాడుతూ.. చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యాత్రికులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. అయితే, ఇప్పటికి ఉత్తరాఖండ్ కు కొంత పరిహారాన్ని కేంద్రం అందించినట్లు షిండే పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న యాత్రికులను అన్ని విధాల ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.