శాసనసభ నిరవధిక వాయిదా..!

assembly-of-APశాసనసభను స్వీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో.. రెండో విడత శాసనసభ సమావేశాలు ముగిశాయి. ద్రవ్యవినిమయ బిల్లును ఏ చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో సర్కార్ నెగ్గించుకుంది. అనంతరం ఏ సమస్యలపై చర్చించకుండానే స్వీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, సభను నిరవధికంగా వాయిదా వేయటంఫై ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. తెదేపా నేతలు టీడీఎల్పీ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.సమస్యలపై చర్చించమంటే.. సభను వాయిదా వేసుకుని పారిపోతారా అని నేతలు నినాదాలు చేశారు.