నాకాళ్లు పట్టుకొంటారా.. !

Jagan akabaruddin conspiracy to block Telangana says KTR TRSతెరాస అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తోన్న తెరచాటు వసూళ్లు, సెటిల్ మెంట్ల వార్తలపై తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తమ కుటుంబ సభ్యుల ఆస్తులపై, తన సెటిల్ మెంట్లపై వస్తున్న ఆరోపణలపై కూడా ఎవరితోనైనా విచారణ జరిపించుకోవచ్చన్నారు కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోపణలు రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధగానే ఉన్నానని ఆయన తెలిపారు. ఒక వేళ ఆస్తులు లేకపోతే బాబు, రాధాకృష్ణలు నాకాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ ఈ సందర్బంగా
తెలిపారు. కేటీఆర్ సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నారంటూ ఏబీఎన్ “తెలంగాణ సెంటిమెంట్ తో.. భోగాల సెటిల్ మెంట్లు” పేరుతో కథనాన్ని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.