కోడిపుంజుని కిడ్నాప్ చేస్తే…?

bangaru-kodipettaన‌వ‌దీప్‌, స్వాతి జంట‌గా న‌టిస్తున్న చిత్రం బంగారు కోడి పెట్ట. గురు ఫిల్స్మ్ సంస్థ నిర్మిస్తోంది. రాజ్ పిప్పళ్ల ద‌ర్శకుడు. చిత్రీక‌ర‌ణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈనెల‌లో పాట‌ల్ని, వ‌చ్చే నెల‌లో సినిమానీ విడుద‌ల చేస్తారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. యేడాదికి ఒక్క సంక్రాంతే వ‌స్తుంది. ఈ సినిమాతో రెండో సారి ఆ పండుగు తీసుకొస్తున్నాం. కోడి పుంజుని కిడ్నాప్ చేయ‌డం, సినిమా అడిష‌న్స్, పేకాట టోర్నమెంట్‌ ఇలా చిత్రవిచిత్రమైన స‌న్నివేశాల‌తో సాగే సినిమా ఇది. మ‌నిషి ఎన్ని అడ్డదార్లు తొక్కాల‌నుకొన్నా.. జీవితం అత‌న్ని త‌న‌దైన దారిలోనే న‌డిపిస్తుంది… అనే విష‌యంతో సాగే సినిమా ఇది.. అన్నారు. స్వామి రారాతో ఓ విజ‌యాన్ని అందుకొన్న స్వాతి… ఈ సినిమాతో ఎంతలా మెప్పిస్తుందో చూడాలి.