రూలర్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సినిమా నుంచి ఒక్కో కథానాయికా తప్పుకొంటోంది. నయనతార, అసిన్, విద్యాబాలన్, ఎరికా ఫెర్నాండేజ్, ఛార్మి, త్రిష – వీళ్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. త్రిష ఓ కథానాయికగా ఖాయం అయ్యిందని ప్రచారం జోరుగా సాగింది. బాలయ్య-త్రిషల కాంబినేషన్ ఎలా ఉంటుందో..? అనే ఆసక్తికరమైన రచ్చ కూడా సాగింది. అయితే తాజాగా త్రిష ఓ బాంబు పేల్చింది. బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నా… అనే వార్తల్లో నిజం లేదు. నా దగ్గరకు అలాంటి ప్రతిపాదన ఏమీ రాలేదని చెప్పింది. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో ఓ సందేశం పంపింది. పాపం… బాలయ్యకు కథానాయికలెప్పుడు దొరుకుతారో, ఏమిటో?