త‌మ్మూ వ‌స్తే.. మ‌హేష్ ‘ఆగ‌డు’

mahesh tamannaమ‌హేష్‌బాబుతో త‌మ‌న్నా జోడీ కట్టనుందా?  ఈ ప్రశ్నకు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. మ‌హేష్‌బాబు – శ్రీ‌నువైట్ల క‌ల‌యిక‌లో రూపొంద‌నున్న చిత్రం ‘ఆగ‌డు’. ఆగ‌స్టులో చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తారు. ఈ సినిమాలో త‌మ‌న్నాని క‌థానాయిక‌గా ఎంచుకొన్నార‌ట‌. త‌మ‌న్నాకి మ‌హేష్‌తో జ‌త‌క‌ట్టే అవ‌కాశం ఇంత‌కు ముందే వ‌చ్చింది. అయితే కాల్షీట్ల స‌మ‌స్య వ‌ల్ల‌… ఆ సినిమాల్ని వ‌దులుకొంది త‌మ‌న్నా. ఈసారి మాత్రం త‌మ‌న్నా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేదు. సో… ప్రిన్స్‌- త‌మ్మూ జోడీ దాదాపు సెట్ అయిన‌ట్టే. ప్రస్తుతం శ్రీ‌నువైట్ల ఆగ‌డు క‌థ‌కి తుదిమెరుగులు దిద్దుతున్నారు. వినోదం, యాక్షన్ క‌ల‌గ‌లిపిన ఈ చిత్రం దూకుడు రికార్డుల‌ను బ్రేక్ చేయాల‌ని మ‌హేష్ అభిమానులు కోరుకొంటున్నారు.